Tuesday, May 7, 2024

President : హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి ముగింపు ఉత్స‌వాల్లో పాల్గొనేందుకు ఆమె హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. పూలగుచ్ఛంతో ఆహ్వానించి, శాలువా కప్పి ప్రెసిడెంట్ ను సన్మానించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రెసిడెంట్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి పరిచయం చేశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement