Friday, April 26, 2024

భ‌ద్రాచ‌లం చేరుకున్న రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన విష‌యం తెలిసిందే. అయితే రాష్ట్ర‌ప‌తి కాసేప‌టి క్రిత‌మే భ‌ద్రాచ‌లం చేరుకున్నారు. భద్రాద్రి, రామప్ప ఆలయాలను సందర్శించనున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామిని, రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్​ స్కీం కింద మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రపతి భూమి పూజ చేస్తారు. రాష్ట్రపతి టూర్​ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement