Tuesday, April 30, 2024

HYD: జేపీ నడ్డాకు పోలీసులు షాక్.. ర్యాలీకి నో పర్మిషన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. అయితే జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో బీజేపీ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొననున్నారు. ఇందుకోసం ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు.

అయితే జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు అనుమతి లేదని డీసీపీ చందన దీప్తి తెలిపారు. కోవిడ్ నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు ఈనెల 10 వరకు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement