Monday, April 29, 2024

కలహండి జిల్లాలో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

మావోయిస్టులు..పోలీసుల‌కి మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో మంగళవారం ఎన్ కౌంటర్ జ‌రిగింది. కలహండి జిల్లాలోని ఎం. రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాపరెంగా-లుడెన్ గా అటవీ ప్రాంతంలో నేడు మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ లో డీఎస్పీకి గాయాలయ్యాయి.డీఎస్పీని బోలరింగ్ లోని భీమాబోయ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్నాయనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఇవాళ పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఎన్ కౌంటర్ జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement