Friday, May 3, 2024

మానవత్వం చాటిన కానిస్టేబుల్.. అనాధను అక్కున చేర్చుకున్న పోలీస్

పోలీసులు నిత్యం ఏదో పనిలో బిజీగా ఉంటారు. అయినా ఓ కానిస్టేబుల్ ఒత్తిడి ఉన్నా వాటిని పక్కకు పెట్టి తన మానవత్వాన్ని చాటుకున్నారు. 70ఏళ్ల ఓవృద్దురాలు అలకాపురికాలనీ, కలెక్టరేట్ ప్రాంతాల్లో తిరుగుతూ బిక్షాటన చేసుకుంటూ జీవిస్తుంది. కొన్నిరోజులుగా అన్నపానీయాలు లేకుండా రోడ్డు పక్కన స్పృహ తప్పిపడిపోయింది. అటుగా వెళుతున్న ఎవరూ పట్టించుకోకుండా పోతున్నారు. అయితే పెట్రోలింగ్ చేస్తున్న నల్గొండ వన్ టౌన్ కానిస్టేబుల్ శీలం వినోద్ కుమార్ ఆమెను చూసి చలించిపోయారు. ఆ వృద్ధురాలిని మందలించినా ఉలుకుపలుకు లేదు. వెంటనే మంచినీళ్లు తెచ్చి ముఖం కడిగి నీళ్లు తాపించారు. అక్కడ నుండి తీసుకుపోయి పెట్రోల్ బంక్ పక్కన కూర్చోబెట్టి భోజనం చేయించారు. అప్పుడు ఆ వృద్ధురాలి ముఖంలో కళ వచ్చింది. వృద్దురాలిని అక్కున చేర్చుకున్న కానిస్టేబుల్ వినోద్ ను పోలీస్ అధికారులు, సిబ్బందితోపాటు జనం అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement