Thursday, May 2, 2024

కేదార్ నాథ్ లో ..ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

కేదార్ నాథ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు చేశారు. నేడు మోడీ ఉత్తరాఖండ్‌ పర్యటనలో ఉన్నారు.ఇవాళ సాయంత్రం బ్రదీనాథ్‌ కూడా మోడీ వెళ్లనున్నారు. అక్కడ కూడా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. బాబా కేదార్‌కు ఆయన హారతి ఇచ్చారు. ఉదయం 8.30 నిమిషాలకు ఆయన కేదార్‌నాథ్‌ చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక వస్త్రధారణలో మోదీ ఆలయాన్ని విజిట్ చేశారు.హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన చంబా మహిళలు చేతితో తయారు చేసిన సంప్రదాయ డ్రెస్సు చోలా దొరను ధరించిన ఆయన ఆలయ దర్శనం చేసుకున్నారు. కేదార్‌నాథ్‌లో ఉన్న ఆది గురువు శంకరాచార్య సమాధిని కూడా ఆయన సందర్శించారు. గౌరికుండ్‌ నుంచి కేదార్‌నాథ్‌ వరకు రోప్‌వే ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement