Monday, April 29, 2024

రూ.20ల‌పై విశ్వాసం లేద‌ని రాసిన వ్య‌క్తి – వైర‌ల్ గా మారిన వార్త‌

ఓ వ్య‌క్తి 20రూపాయ‌ల నోట్ పై విశ్వాసంగా లేద‌ని హిందీలో రాశాడు. దాంతో ఈ దీనిపై మీమ్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి.
అయితే భారతీయ కరెన్సీ నోట్ల మీద రాయటం ఇల్లీగల్. కానీ ఈ వ్యక్తి మాత్రం తన యొక్క బాధని 20 రూపాయల నోటు మీద రాసి చూపించాడు. ఇలా రాయడంతో గతంలో ఉన్న సోనం గుప్తా మీమ్స్ నెటిజన్లకు గుర్తొచ్చింది. ఇది ఇలా ఉంటే దాని తరువాత మరొక పిక్చర్ అదే టెక్స్ట్ తో చేతి మీద ఒక మనిషి రాసుకున్న ఫోటో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. సోనమ్ గుప్త గురించి అప్పట్లో 2000 రూపాయల నోట్ల మీద వ్రాసి ఉన్న మీమ్స్ వైరల్ అయ్యాయి. అలానే ఐఐటీ గౌహతి క్వశ్చన్ పేపర్ మీద కూడా అప్పట్లో వ్రాయడం వైరల్ అయ్యింది. అయితే అందరూ అనుకుంటున్నారు అప్పుడు మోసపోయిన వ్యక్తే మళ్లీ రాశి చేతిలో మోసపోయాడేమోనని. మరి కొంతమందైతే సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఇలా రాస్తున్నాడు అని అంటున్నారు. చాలా మంది రాశి ఎవరూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ విష‌యం ఇప్పుడు తెగ వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement