Monday, May 6, 2024

హోట‌ల్ లో దోశ‌లు వేసిన ప్రియాంక‌గాంధీ.. వీడియోతో

కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంక‌గాంధీ ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.ఈ మేర‌కు కర్ణాటక రాష్ట్రం మైసూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అక్కడ ఓ హోటల్‌ వద్దకు వెళ్లిన ఆమె స్వయంగా దోశలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.కర్ణాటకలో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. షెడ్యూల్‌ ప్రకారం మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.కాగా బిజెపిపై కాంగ్రెస్ ప‌లు విమ‌ర్శ‌లు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement