Friday, May 17, 2024

ప‌ట్టాలు త‌ప్పిన ప్యాసింజ‌ర్.. ఇద్ద‌రు మృతి.. 16మందికి తీవ్ర గాయాలు

ఓ ప్యాసింజ‌ర్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. దాంతో ఇద్ద‌రు ప్ర‌యాణికులు మృతి చెందారు..మ‌రో 16మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.ఈ సంఘ‌ట‌న ఈజిప్టులో రాజధాని కైరోలో రైలు నైలు డెల్టాలోని మెనోఫ్ నగరానికి వెళ్తుండగా కల్యూబ్ నగరంలోని స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పినట్లు అధికారులు చెప్పారు. ఈ రైలు ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఘటనాస్థలికి కనీసం 20 అంబులెన్స్‌లను పంపించామని, క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించామన్నారు. ఈజిప్టులో రైలు ప్రమాదాలు సాధరణంగా జరుగుతున్నాయి. 2021లో దక్షిణ ఈజిప్ట్‌ నగరమైన తహతాలో రెండు రైళ్లు ఢీకొనడటంతో 32 మంది మరణించారు. గతేడాది జరిగిన ఓ రైలులో మంటలు చెలరేగి 300 మందికిపైగా ప్రయాణికులు మృతిచెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement