Saturday, May 4, 2024

బాబర్ ఆజమ్ కంటే కోహ్లీయే ఇష్టం.. ఆసియా కప్ ఆడమంటోన్న పాకిస్థాన్ ఫ్యాన్స్

మా కింగ్ బాబర్ ఆజమ్ కంటే నిన్నే ఎక్కువ ఇష్టపడతామని పాకిస్థాన్ ఫ్యాన్స్ క్రికెటర్ కోహ్లీ ప్లకార్డులను ప్రదర్శించారు.ముల్తాన్ లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో వారు కోహ్లీని ఉద్దేశించి ప్లకార్డులు ప్రదర్శించారు. ‘హాయ్… కింగ్ కోహ్లీ ఆసియా కప్ ఆడు. మా కింగ్ బాబర్ ఆజమ్ కంటే మేం నిన్నే ఎక్కువ ఇష్టపడతాం అని ఇద్దరు ఫ్యాన్స్ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వచ్చే ఏడాది పాకిస్థాన్ లో ఆసియా కప్ జరగనుంది. అయితే, పాకిస్థాన్ లో తాము ఆడబోము అని భారత్ స్పష్టం చేసింది. తమ దేశంలో ఆసియా కప్ ఆడకపోతే… ఇండియాలో జరిగే ప్రపంచకప్ లో తాం ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయినప్పటికీ బీసీసీఐ పట్టించుకోలేదు. పాకిస్థాన్ లో ఆడటమనేది బీసీసీఐ తీసుకునే నిర్ణయం కాదని… ఇది భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయమని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే…. తమ దేశానికి వచ్చి ఆసియా కప్ ఆడాలంటూ కోహ్లీని పాక్ అభిమానులు కోరుతున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement