Tuesday, April 30, 2024

RAINS: వడగండ్ల వానతో రైతులకు నష్టం

కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో పలు గ్రామాలలో కురిసిన వడ గండ్లతో కురిసిన అకాల వర్షం భారీగా నష్టం కలిగించింది. అకస్మాత్తుగా వచ్చిన వడగండ్ల వాన మండలంలోని పలు గ్రామాలలో బీభత్సం సృష్టించింది. అక్కపల్లి గ్రామంలో రాళ్ల వానకువడంతో పంటలు దెబ్బ తిని రైతులు భారీగా నష్ట పోయారు. ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ ప్రాంగణంలో బలంగా వీచిన ఈదురు గాలికి పెద్ద చెట్టు విరిగి పడ్డాయి. దీంతో చెట్టు కింద నిలిపి ఉన్న పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. బొప్పా పూర్ గ్రామ సరిహద్దులో గంగమ్మ పండుగ సందర్భంగా గ్రామ గంగ పుత్ర సంగం వారు శివ పార్వతుల ఫోటోలతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్ నేల కూలింది. పలు గ్రామాలలో బలమయిన గాలులతో కురిసిన వర్షానికి వరి పంట నష్టం వాటిల్లింది. రాళ్ల వానతో రైతుల వరి పంట దెబ్బ తిని రైతులు నష్టాల పాలయ్యారు. అక్కపాల్లి గ్రామానికి చెందిన నిరుపేద ఇంటిపై కప్పు గాలికి లేచి పోయి ఇల్లు ధ్వంసమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement