Thursday, April 25, 2024

ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా – ‘టీఎస్ ఆర్టీసీ’లో కొత్త ప‌థ‌కం – స‌జ్జ‌నార్

తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ఆర్టీసీలో ప‌లు కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చే దిశ‌గా దూసుకెళ్లుతున్నారు స‌జ్జ‌నార్. కాగా టిఎస్ ఆర్టీసీలో త్వ‌ర‌లోనే ఓ కొత్త ప‌థ‌కానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. ప్రపంచ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ట్విట్ట‌ర్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసిన సజ్జనార్ … ఈ ఫొటో ఎక్క‌డిది? అంటూ ఓ పోల్ క్వ‌శ్చ‌న్ మాదిరిగా ట్వీట్ చేశారు. ఈ ఫొటోపై చాలా మంది స్పందిస్తూనే ఉండ‌గా.. ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళల కోసం.. ప్ర‌త్యేకించి బాలికల కోసం ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణం లాంటిదేమైనా ప్ర‌క‌టించ‌నున్నారా? అంటూ ఓ నెటిజ‌న్ అడిగారు. దీనికి సజ్జనార్ వెంటనే స్పందిస్తూ.. ఓ ప‌థ‌కాన్ని రూపొందిస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామంటూ స‌మాధానం ఇచ్చారు. ఆ కొత్త ప‌థ‌కం ఏమై ఉంటుంద‌న్న దానిపై ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement