Sunday, April 28, 2024

Story : ప‌నే ముద్దు.. విరామం వద్దు.. 74ఏళ్ల పెద్దాయ‌న‌

ప్రస్తుత పరిస్థితుల్లో 30..40ఏళ్లకే అలసిపోతున్నారు..అయితే జాబ్ నుండి రిటైర్ అయినా విశ్రాంతి తీసుకోకుండా తన పని తాను చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ పెద్దాయన. ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత ఖాళీగా ఇంట్లో కూర్చొకుండా చేతి రుమాళ్లు..అదేనండీ క‌ర్చీఫ్ లు అమ్ముతున్నాడు 74ఏళ్ల పెద్దాయ‌న‌.ఈయ‌న పేరు హ‌స‌న్ అలీ. ముంబైలోని బోరివాలీ రైల్వే స్టేషన్ ను ఉపాధి కేంద్రంగా చేసుకున్నాడు. నాటి నుంచి విరామం అన్నదే తెలియకుండా రోజూ కర్చీఫ్ లు విక్రయిస్తూ ఉన్నాడు. అఫీషియల్ హ్యుమన్స్ ఆఫ్ బాంబే అనే ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో హసన్ అలీ స్ఫూర్తినీయ అంశాన్ని షేర్ చేశారు. విక్రయించడాన్ని ఓ కళగా ఆయన పేర్కొన్నారు. అమ్మడం ఓ కళ. ఓ వ్యక్తి తాను చెప్పకుండానే అతడికి ఏమి కావాలో నీవు తెలుసుకుని, అది విక్రయించాలి.

ఎన్నో ఏళ్ల అనుభవంలో నేను ఇదే నేర్చుకున్నాను. నేను వ్యక్తి వైపు చూసినప్పుడు వారికి ఏమి కావాలో తెలుసుకోగలను అని హసన్ అలీ వివరించారు. కుటుంబ సభ్యులు ఎందుకు, ఏమి తక్కువ అయిందని నీవు రైల్వే స్టేషన్లో అమ్మకాలు చేస్తుంటావని ఆయన్ను అడుగుతుంటారు. తనకు భార్య, కుమారుడు, కోడలు, మనవరాలు ఉన్నారని, వారు ఎంతో ప్రేమిస్తుంటారని ఆయన చెప్పారు. వారంతా విశ్రాంతి తీసుకోవాలని కోరుతుంటారని తెలిపారు. అయినా, పని చేయడమే తనకు ఇష్టమని, ఖాళీగా కూర్చోవడం ఇష్టముండదని చెప్పారు. ఆయనకు ఎక్కువ మంది తరచూ కొనుగోలు చేసే కస్టమర్లే ఉన్నట్టు తెలిపారు. వారంతా ముద్దుగా కాకా అని పిలుస్తుంటారు. ఈ కాక ఎందరికో స్ఫూర్తినీయం అంటూ ఇన్ స్టా యూజర్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement