Monday, April 29, 2024

Nizamabad రూరల్ లో కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీ సాధించాలి – మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో గల ఎస్ ఎల్ జి గార్డెన్ లో రూరల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం భూపతి రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఇందల్ వాయి ధర్ పెల్లి డిచ్ పల్లి సిరికొండ మండలాలకు చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ కి చెందిన 5 వందల మంది కార్యకర్తలు కాంగ్రెస పార్టీ లో చేరారు.పార్టీ కండువా కప్పి భూపతి రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వనించారు. .

ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీ ఆర్ ఎస్ పార్టీ నీ సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కే సీ ఆర్ కుటుంబం తప్ప ఎవరూ భాగుపడ లేదని ప్రతీ మనిషి పై అప్పుల కుప్ప చేసిన బీ ఆర్ ఎస్ కు ఓటేస్తే మనుషులను కూడ అ మ్మేస్థారన్నారు. గత పది సంవత్సరాల నుండి ఈ ఎమ్మేల్యేలు ఏం చేస్తున్నారు. విచ్చల విడి దోపిడీ ఎన్నాళ్ళు ఈ దోపిడీకి అడ్డు కట్ట వేయాలంటే కాంగ్రెస్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు.

.మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నగేశ్ రెడ్డి ముప్ప గంగా రెడ్డి శేఖర్ గౌడ్ యాదగిరి అమృతా పూర్ గంగా ధర్.సుందర్ రెడ్డి ఆనంద్ రావు తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్ లు ఎం పి టి సీ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement