Friday, May 3, 2024

రాష్ట్రపతి ని కలిసిన నిర్మలాసీతారామన్

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ కొద్దిసేప‌టి క్రితం కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయానికి వచ్చిన నిర్మలాసీతారామన్ ఆర్థిక శాఖ అధికారులతో కలిసి రాష్ట్రపతిని కలిసేందుకు రాష్ట్రపతి భవన్ కు వచ్చారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేంద్రమంత్రి రాష్ట్రపతి కోవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీతారామన్ ఈసారి ట్యాబ్‌ను ఉపయోగించి పార్లమెంటులో 2022 బడ్జెట్‌ను సమర్పించనున్నారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం 3.45 గంటలకు విలేఖరుల సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement