Sunday, May 5, 2024

Flash: సుమో లోయలో పడి 9 మంది దుర్మరణం

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూంచ్‌ జిల్లాలోని బఫ్లియాజ్‌ సమీపంలో అదుపుతప్పిన టాటా సుమో లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సురాన్‌ కోట్‌కు చెందిన 13 మంది మోరాహ్‌లో జరిగిన ఓ పెండ్లివేడుకకు హాజరయ్యారు. అనంతరం తిరిగి సురాన్‌కోట్‌కు టాటా సుమోలో బయలుదేశారు. అయితే బఫ్లియాజ్‌ వద్ద అదుపుతప్పిన లోయలో పడింది. ప్రమాద స్థలానికి రెస్క్యూ టీమ్‌లను పంపినట్లు పూంచ్ జిల్లా అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement