భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించింది తెలంగాణ యువ క్రీడాకారిణి నిఖత్ జరీన్. ఆదివారం జరిగిన ఫైనల్లో 50 కిలోల విభాగం పైనల్లో నిఖత్ 4–1 తేడాతో రైల్వేస్ క్రీడాకారిణి అనామికను చిత్తుగా ఓడించి చాంపియన్ గా నిలిచింది. దాంతో, ఈఏడాది ఆడిన అన్ని టోర్నమెంట్లలోనూ గెలిచిన నిఖత్ అజేయంగా నిలిచినట్టయింది. ఈ ఏడాది ఆరంభంలో స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్ లో పసిడి గెలిచిన నిఖత్ తర్వాత ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆపై, కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి పతకం సొంతం చేసుకున్న నిఖత్ ఇప్పుడు జాతీయ చాంపియన్ షిప్ కూడా గెలిచి ఔరా అనిపించింది. నిఖత్ ప్రతిభకు ప్రోత్సాహంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 2 కోట్ల నగదు, జూబ్లీహిల్స్ లో 600 గజాల ఇంటిస్థలం ప్రోత్సాహకంగా ఇచ్చింది. గ్రూప్–1 ఉద్యోగం కూడా హామీ ఇచ్చింది.
మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్.. బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్
Advertisement
తాజా వార్తలు
Advertisement