Wednesday, April 24, 2024

పార్టీ పేరులోంచి తెలంగాణ తీసేయడంతో కేసీఆర్‌కి బలం పోయింది : ఎమ్మెల్యే జగ్గారెడ్డి


బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏపీలో అట్రాక్ట్‌ చేయలేరని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణలో అట్రాక్ట్‌ చేయగలరు అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్టీ పేరులోంచి తెలంగాణ తీసేయడంతో కేసీఆర్‌కి తెలంగాణలో బలం పోయిందన్నారు. కేసీఆర్‌లో ఎక్కడో ఓ మూలన సమైక్య భావన ఉందన్నారు. తెలంగాణ వాదాన్ని కేసీఆర్‌ చంపేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఇకపై కేసీఆర్‌తో ఆడుకుంటారు అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement