Friday, May 10, 2024

తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ తరఫున ప్రచారం నిర్వహించడం, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో చెన్నైలోని వివిధ ప్రాంతాలతోపాటు మైలదెతురాయ్‌, కరైకల్‌లోని వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నది. దీంతోపాటు పుదుచ్చేరిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రనిధులకు సంబంధించి ఇప్పటికే నదైన కేసు దర్యాప్తునకు వచ్చిన సమాచారంతో ఎన్‌ఐఏ అధికారులు ఆయా ప్రాంతాల్లోని పలువురి నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement