Sunday, May 5, 2024

TS | 30న కొత్త సెక్రెటేరియట్​ ప్రారంభం.. 28వ తేదీ లోపు శాఖలవారీగా షిఫ్టింగ్

రేపటి (26వ తేదీ) నుంచి సమీకృత కొత్త సచివాలయానికి శాఖల షిఫ్టింగ్ షురూ కానుంది. ఈ నెల 28వ తేదీ వరకు అంటే మూడు రోజుల్లో మొత్తం శాఖలన్నీ షిఫ్ట్​ అయిపోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30వ తేదీన సమీకృత కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఒక్కో ఫ్లోర్ కు మూడు శాఖల చొప్పున కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోమ్ శాఖ, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ ఉండబోతున్నాయి.

ఇక.. మూడో ఫ్లోర్లో అగ్రికల్చర్ & ఎస్సీ డెవలప్​మెంట్​ శాఖలకు కేటాయించారు. నాలుగవ అంతస్తులో ఇరిగేషన్ అండ్ లా, ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్ లో సీఎం, సీఎస్ లకు కేటాయింపులు చేశారు. ఈ మేరకు శాఖల వారిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించి, అదేరోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం చేయనున్నట్టు సమాచారం. దీనికిగాను అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఇవాళ కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ప్రారంభోత్సవం కోసం శాఖల వారిగా బాధ్యతల అప్పగించినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement