Monday, May 6, 2024

కొత్త‌గా 11,739 క‌రోనా కేసులు

క‌రోనా కేసులు నిన్న 15,940వేలు న‌మోదు కాగా..కొత్త‌గా 11,739పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.
దీంతో మొత్తం కేసులు 4,33,89,973కు చేరాయి. ఇందులో 4,27,72,398 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 92,576 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గత 24 గంటల్లో 25 మంది మృతిచెందగా, 10,917 మంది డిశ్చార్జీ అయ్యారు.మొత్తం కేసుల్లో 0.21 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం, మరణాల రేటు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 2.59 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ 197 కోట్లు దాటింది. శనివారం ఒక్కరోజే 11 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement