Thursday, April 25, 2024

Big Story: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ఇక కొత్త కళ.. 699 కోట్లతో డెవలప్​మెంట్​ పనులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అత్యంత కీలకమైనది. రోజుకు వేలాది మంది రాకపోకలుసాగిస్తూ తమ గమ్యస్థానాలకు చేర్చడంలో తనదైన పాత్ర పోషిస్తు ఉంటోంది. దేశంలోనే ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలో అత్యంత ముఖ్యమైన స్టేషన్‌ సికింద్రాబాద్‌ కూడా ఒకటి. ఈ క్రమంలో ప్రయాణికుల కోరిక మేరకు, వారికి సరిపడా అవసరాలను తీర్చేందుకు దమ రైల్వే తనవంతు పాత్రను నిర్వర్తిస్థోంది. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందిపుచ్చుకుంటూ ఆ స్థాయిలోనే సౌకర్యాలు, సదుపాయాలను అందించడానికి ప్రయత్నిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్‌ల సుందరీకరణలో భాగంగా రైల్వేలు, రైల్వే స్టేషన్ల పునరాభివృద్దికి ప్రాధాన్యతని ఇస్తోంది. వీటి ప్రారంభంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలోని ప్రధాన స్టేషన్ల అప్‌గ్రేడియేషన్‌ను చేపట్టడానికి గిరిధర్‌లాల్‌ కన్స్‌ట్రక్షన్‌ కంపెనీ పైవేట్‌ లిమిటెడ్‌ ( న్యూ ఢిల్లిd ) కంపెనీకు కాంట్రాక్టును బుధవారంనాడు ఇచ్చింది. 36 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టింది. కాగా ఈ ప్రాజెక్టు అమలుకు సుమారుగా రూ. 699 కోట్లు వ్యయం కావచ్చని అంచనా వేసింది.

ఎన్‌ఎస్‌జి1 స్టేషన్‌ (నాన్‌ సబర్బన్‌ గ్రేడ్‌ – 1 ) విభాగంలో జోన్‌ అంతటా ఉన్న ఒకే ఒక స్టేషన్‌ సికింద్రాబాద్‌ స్టేషన్‌ కావడం గమనార్హం. రూ. 500 కోట్ల ఆదాయం లేదా సంవత్సరానికి 20 మిలియన్ల ప్రయాణికులు ఉన్న స్టేషన్లు ఎన్‌ఎస్‌జి 1 కిందకు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ స్టేషన్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సగటున రోజుకు 200 రైళ్లను నడుపుతున్నారు. సగటున 1.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీరి సంఖ్య పెరుగుతుందని అంచనా వేసిన ద మ రైల్వే ఇందుకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, సదుపాయాలకు ప్రణాళికలు రూపొందించుకుంది.

అందులో భాగంగానే స్టేషన్‌ను పెద్ద ఎత్తున అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రతిపాదించింది. రైలు వినియోగదారులకు ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు ఏర్పడకుండా చూస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ కాంప్లెక్స్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలు మౌళిక వసతులు, సదుపాయాలు ఉండేలా దక్షిణ మధ్య రైల్వే ఒక మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ అప్‌గ్రేడియేషన్‌ కింద చేపట్టిన పనులు ఇలా ఉండనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement