Friday, May 3, 2024

పీసీసీ ప‌ద‌వికి రాజీనామ చేసిన న‌వ్ జ్యోత్ సింగ్ సిద్ధూ – ట్విట్ట‌ర్ లో పోస్ట్

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పిలుపు మేర‌కు పంజాబ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప‌ద‌వికి న‌వ్ జ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూడడం తెలిసిందే. అందులో పంజాబ్ కూడా ఒకటి. దీంతో పార్టీని సంస్కరించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా చేపట్టారు. ఇటీవలి సీడబ్ల్యూసీ సమావేశంలో అధ్యక్ష బాధ్యతలను సోనియానే నిర్వహించాలంటూ తీర్మానించడం తెలిసిందే. అందుకు ఆమె అంగీకరించారు. ఆ వెంటనే ఐదు రాష్ట్రాల్లోని పీసీసీ చీఫ్ ల రాజీనామాకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన ఐదు రాష్ట్రాల్లోనూ పార్టీ రాష్ట్ర శాఖలను పునర్వ్యవస్థీకరించాలంటూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షురాలి ఆదేశంతో సిద్ధూ రాజీనామా చేశారు. ఈ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు పార్టీ అధ్యక్షురాలిని ఉద్దేశించి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement