Thursday, April 25, 2024

మహిళా ద్రోహిగా జగన్ పాలన.. ‘నారీ సంకల్ప దీక్ష’ లోకేష్ మద్దతు

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అక్కా, చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందంటూ కురిపించిన ప్రేమ,ఆప్యాయత ఎక్కడికి పోయాయి? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. జగన్ పాలనలో బాగుండటం దేవుడెరుగు..బతికి వుండటమే అదృష్టంగా భావించే దురదృష్ట రోజులు దాపురించాయని అన్నారు. పట్టపగలు రోడ్డున మహిళలు నడవలేని దుస్థితి ఉందన్నారు. రోజుకో దుర్మార్గుడు, వైసిపి ముసుగు కప్పుకున్న నీచులు ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

మహిళలకు మద్యపాన నిషేధం వరం ఇస్తున్నానన్న జగన్.. ప్రాణాంతక సొంత మద్యాన్ని అమ్ముతూ అక్కాచెల్లెమ్మల పుస్తెలు తెంపేస్తున్నారని మండిపడ్డారు. మహిళా ద్రోహిగా సాగుతున్న జగన్ రెడ్డి పాలనని నిరసిస్తూ జనవరి 31 న టిడిపి కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో జరగనున్న నారీ సంకల్ప దీక్షకు తన పూర్తి మద్దతు తెలియజేస్తున్నానని చెప్పారు. భద్రత- భవిష్యత్ కోసం మహిళలు సాగించే  పోరాటానికి అన్ని విధాలా అండగా నిలుస్తానని నారా లోకేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement