Thursday, April 25, 2024

ముత్యాల ముగ్గు వేసిన మంత్రి ‘సత్యవతి రాథోడ్’

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : రైతు బంధు పథకం ద్వారా అన్నదాతల అకౌంట్ల లో 50వేల రూపాయలు జమ చేసిన గొప్ప సందర్భాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సంబరాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి బతుకమ్మ ఆట ఆడి, ముగ్గుల పోటీలో భాగంగా ముగ్గులు వేశారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి స్థానిక ప్రజా ప్రతినిధులు, టి.ఆర్.ఎస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement