Saturday, April 27, 2024

హ‌నుమాన్ పై భ‌క్తిని చాటుకున్న- ముస్లీం భ‌క్తులు

హ‌నుమాన్ పై త‌మ భ‌క్తిని చాటుకున్నారు ముస్లీం భ‌క్తులు. భోపాల్ లో జ‌రిగిన హ‌నుమాన్ శోభాయాత్ర‌లో ముస్లింలు పాల్గొని మ‌త‌సామ‌ర‌స్యం చాటుకున్నారు. భోపాల్ న‌గ‌రం కాషాయం జెండాల‌తో మెరిసిపోయింది. హ‌నుమంతుడిపై ముస్లింలు పూల వ‌ర్షం కురిపించారు. భ‌క్తుల‌కు ముస్లింలు హ‌నుమాన్ జ‌యంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. జై హ‌నుమాన్ అంటూ నిన‌దించి.. త‌మ భ‌క్తిని చాటుకున్నారు. ఈ శోభాయాత్ర‌లో సుమారు 5 వేల మంది భ‌క్తులు పాల్గొన్నారు. హ‌నుమాన్ శోభాయాత్ర నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా అన్ని షాపుల‌ను మూసి వేయించారు. ఖాజీ క్యాంప్ ఏరియాలో శోభాయాత్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో వేరే మార్గంలో శోభాయాత్ర‌ను కొన‌సాగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement