Sunday, April 28, 2024

ఎన్‌సీసీ ప్యానెల్‌లో MSD కి చోటు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి మరో గౌరవం లభించింది. నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ)ని సరికొత్తగా తీర్చిదిద్దే కమిటీలో సభ్యుడిగా నియమించారు. రక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన 15 మంది సభ్యుల ఈ కమిటీలో ధోని సహా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర, ఇతర రంగాల నిపుణులున్నారు. భారత ఆర్మీలో ధోని గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అతని పేరును కమిటీలో చేర్చింది. క్రమశిక్షణ, కార్యదీక్షతకు మారుపేరైన ఎన్‌సీసీ ని మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవా ల్సిన చర్యలపై ఎన్‌సీసీ కమిటీ చర్చిస్తుంది. కాగా ధోనీకి ఇప్పటికే లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవ హోదా ఉంది. ధోనీ ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ఆర్మీతో కలిసి చాలా రోజులు గడిపాడు. పారాచూట్ రెజిమెంట్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు.

మాజీ చట్ట సభ్యుడు బైజయంత్ పాండా ఈ ప్యానెల్‌కు సారథ్యం వహిస్తారు. ధోనీతోపాటు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, కల్నల్ (రిటైర్డ్) రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్, రాజ్యసభ సభ్యుడు వినయ్ సహస్రబుద్ధె, ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్, జామియా మిలియా వైస్ చాన్స్‌లర్ నజ్మా అక్తర్ వంటివారు ఈ ప్యానెల్‌లో ఉన్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టుకు ధోనీని బీసీసీఐ ఇటీవల మెంటార్‌గా నియమించింది. ఇప్పుడు రక్షణ మంత్రిత్వశాఖ ప్యానెల్‌లో చోటు దక్కించుకోవడంతో ధోనీ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

ఇది కూడా చదవండి: ‘మా’ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల..

Advertisement

తాజా వార్తలు

Advertisement