Sunday, April 28, 2024

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్..

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ మునుగోడుతో పాటు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఆ ఆడియోలో కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసిన వెంకట్ రెడ్డి. బీజేపీ అభ్యర్థి తన తమ్ముడు రాజగోపాల్ కు ఓటేయాలని కోరారు. ఏమైనా ఉంటే తాను చూసుకుంటానని వారికి హామీ ఇవ్వడం ప్రస్తుతం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దెబ్బతో తాను పీసీసీ చీఫ్ అవుతానని, రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తానని ఆయన అన్నట్లు అందులో ఉంది. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా.. అధికారంలోకి వస్తానని.. పార్టీలను చూడొద్దు.. రాజగోపాల్ కు ఓటు వేయాలని ఆయన కోరినట్లు ఆడియో లీక్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement