Friday, March 29, 2024

దొంగ నోట్ల ముఠా అరెస్ట్‌.. రూ.3 లక్షలు స్వాధీనం…

కామారెడ్డి జిల్లాలో దొంగనోట్లను సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాహారాష్ట్ర, బైంసా ప్రాంతాల నుంచి కామారెడ్డికి దొంగనోట్లను సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్, బైంసా, నిజామాబాద్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3 లక్షల వరకు నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కామారెడ్డి మండలం దేవునిపల్లి పరిధిలోని కొత్త సాయిబాబా ప్రాంతంలో ఓ ఇంట్లో నుంచి ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement