Wednesday, May 1, 2024

Bangalore :కర్ణాటక పీసీసీ చీఫ్ ను కలిసిన ఎంపీ కోమటిరెడ్డి

కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు.. తెలంగాణలోని ఆ పార్టీ నేతల్లో జోష్ ని పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్.. తెలంగాణ పాలిటిక్స్ విషయంలోనూ తన ‘ట్రబుల్ షూటర్’ పాత్ర పోషిస్తున్నారు. షర్మిల పలుమార్లు ఆయనతో భేటీ కావడం.. కాంగ్రెస్ లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరిక విషయంలో చక్రం తిప్పడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కర్ణాటకకు వెళ్లి, డీకే‌తో భేటీ అయ్యారు.

బెంగళూరులో సమావేశమైన వీరిద్దరూ.. పలువురి చేరికలపై ప్రధానంగా చర్చించుకున్నట్లు సమాచారం. 40నిమిషాలు జరిగిన ఈభేటీ పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరే అంశంపై కూడా చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కాంగ్రెస్ లోకి షర్మిల అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. షర్మిల చేరికపై అధిష్టానం సుముఖంగా ఉందని డీకే శివకుమార్ కోమటిరెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే నేతల అభ్యంతరాలపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement