Sunday, April 28, 2024

Minister: ఏపీలో ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు… అమర్నాథ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎకరం అమ్మితే…తెలంగాణ 150 ఎకరాలు కొనొచ్చని ఏపీ మంత్రి అమర్నాథ్ అన్నారు. నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ పై ఏపీ మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడప గడపకు వెళ్లకపోతే ఎమ్మెలే సీట్లు ఉండవని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.. అంత దైర్యంగా చెప్పిన నేత మరొకరు లేరన్నారు.

ఏపిలో భూముల విలువలు తగ్గాయని చంద్రబాబు కేసీఆర్ కు చెప్పారంటా.. ఒకసారి అచ్యుతాపురం కేసీఆర్ వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందంటూ ఎద్దేవా చేశారు. అచ్యుతాపురంలో ఎకరా అమ్మితే తెలంగాణలో 150 ఎకరాల కొనవచ్చన్నారు. టీడీపీ నేతల భవిష్యత్తుకే గ్యారెంటీ లేదని… టీడీపీ నేతలు ప్రజల భవిష్యత్తుకు ఏమి గ్యారెంటీ ఇస్తారని ఫైర్‌ అయ్యారు. కేజీ బంగారం బెంజ్ కారు అంటూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తారని… సీఎం విజయాన్ని అడ్డుకునే సత్తా చంద్రబాబు ఆయన చెంచా పవన్ కల్యాణ్ కు లేదని విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement