Sunday, May 5, 2024

హెల్మెట్ లేకుండా బైక్ న‌డిపిన ఎంపీ-ఫైన్ వేసిన ఢిల్లీ పోలీసులు

హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ న‌డిపిన కేసులో బిజెపి ఎంపీ మ‌నోజ్ తివారీకి ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ చ‌లాన్ వేశారు. ఎర్ర‌కోట వ‌ద్ద జ‌రిగిన‌ హ‌ర్ ఘ‌ర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎంపీ మ‌నోజ్ తివారీ.. త‌ల‌కు హెల్మెట్ లేకుండా బైక్ న‌డిపారు. అయితే ట్రాఫిక్ ఉల్లంఘ‌న కింద ఆ ఎంపీకి చ‌లాన్ పంపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోను పోస్టు చేసిన ఎంపీ మ‌నోజ్ తివారీ సారీ చెప్పారు. ఫైన్ క‌ట్ట‌నున్న‌ట్లు కూడా వెల్ల‌డించారు. హెల్మెట్ లేకుండా బైక్ న‌డ‌ప‌వ‌ద్దు అంటూ ఎంపీ త‌న ట్వీట్‌లో తెలిపారు. ఎంపీ న‌డిపిన బండికి లైసెన్సు, పొల్యూష‌న్‌, రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్ కూడా లేన‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement