Friday, May 17, 2024

Medak: ఇద్దరు పిల్లలతో చెరువులో దూకి తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలతో పాటు తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొంటూరులో ఈ విషాద ఘటన జరిగింది. చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన వారి మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. అయితే వారికి ఏం కష్టమొచ్చిందో.. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటనతో కొంటూరు ప్రాంత ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement