Thursday, April 25, 2024

ఎంఎన్ఎం పార్టీ వెబ్ సైట్ హ్యాక్.. తాత్కాలికంగా మూసివేత‌

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. కాగా ఎంఎన్ఎం అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన వచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలకు మక్కల్ నీది మయ్యం నుంచి పెద్ద ప్రకటన. జనవరి 30న అధికారికంగా విలీనం జరుగుతుందని అందులో పేర్కొన్నారు. వెంటనే గుర్తించిన ఎంఎన్ఎం నేతలు మెయింటెనెన్స్ కోసమంటూ వెబ్ సైట్ ను తాత్కాలికంగా మూసేశారు. నటుడు కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ వెబ్ సైట్ హ్యాక్ అయింది. కాంగ్రెస్ లో ఎంఎన్ఎం విలీనం కాబోతోందంటూ ఆ పార్టీ వెబ్‌సైట్‌లో హ్యాకర్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎంఎన్ఎం విలీనం అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని, తమ వెబ్‌సైట్‌ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పింది. విలీనం (కాంగ్రెస్‌తో) వార్త పూర్తిగా అబద్ధం. అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. కాకపోతే ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి మాత్రం మద్దతిస్తున్నాం. దీనిపై మా నేత కమలహాసన్ త్వరలో అధికారిక ప్రకటన చేస్తారు అని మీడియాకు ఎంఎన్ఎం ప్రతినిధి మురళి అబ్బాస్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement