Wednesday, March 27, 2024

వివేకా హ‌త్య కేసులో ఐదుగురికి సీబీఐ స‌మ‌న్లు..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఐదుగురికి సీబీఐ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ కేసుపై సీబీఐ కోర్టు విచారణను ప్రారంభించింది. వివేకా హత్య కేసుకు సంబంధించిన ప్రధాన ఛార్జ్ షీట్, అనుబంధ చార్జ్ షీట్ లను విచారణకు స్వీకరించింది. ఐదుగురు నిందితులు ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, శివశంకర్ రెడ్డిలకు సమన్లను జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసుకు SC/01/2023 నెంబర్ ను కేటాయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement