Tuesday, April 30, 2024

మాణిక్కం ఠాగూర్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌విత

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌పై నిప్పులు చెరిగారు. ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల వ‌ల్ల తెలంగాణ రాలేదు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె స్పందించారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌న్నారు. అది గిఫ్ట్ కాదు అని క‌విత తేల్చిచెప్పారు. భారతదేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు. అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం అని క‌విత పేర్కొన్నారు. దయచేసి ఇంకోసారి కేసీఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాల‌ని ఠాగూర్‌కు క‌విత సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement