Saturday, April 27, 2024

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి: కడియం

ఎంతో ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉండి జాతీయ హోదా కల్పించలేని దద్దమ్మలు బీజేపీ నేతలు అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా బీజేపీ…. దళితుల, ఆదివాసుల, గిరిజనుల, మైనారిటీల ఆగ్రహానికి గురవుతోందన్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ కళలుకంటోందని… కానీ అవి కలగానే మిగిలిపోతాయని అన్నారు. ”బండి సంజయ్ నీకు విశ్వవిద్యాలయాలపై అవగాహన ఉందా?” అని ప్రశ్నించారు. విషయపరిజ్ణానం లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement