Friday, May 3, 2024

రోజా ఆరోగ్యంపై ప్రకటన చేసిన సెల్వమణి

ప్రముఖ నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు రోజా భర్త ఆర్కే సెల్వమణి వెల్లడించారు. ఈ ఆపరేషన్లు ఎప్పుడో జరగాల్సి ఉందని.. కరోనా, ఎన్నికల వల్ల ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యంగా ఉన్నారని, ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మారారని, త్వరలోనే ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని సెల్వమణి తెలిపారు.

కాగా ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోకి సైతం రోజా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలలో రోజా స్థానంలో ఇంద్రజ కనిపించారు. దీంతో రోజా అభిమానులు తిరుపతి ఉపఎన్నిక కోసం జబర్దస్త్ షోకి దూరంగా ఉన్నారేమోనని భావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement