Monday, April 29, 2024

మంత్రి పేర్ని నానికి క‌రోనా

ఏపీలో క‌రోనాతో పాటు ఒమిక్రాన్ కేసుల ప్ర‌భావం కూడా అధికంగానే ఉంది. దాంతో రోజుకి 10వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. కాగా ప‌లువురు సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే మంత్రి కొడాలి నానితో
పాటు.. వైసీపీ ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడ్డారు. తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కాగా నేడు పీఆర్సీపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో సమావేశం అయ్యారు. కరోనా సోకడంతో మంత్రి పేర్ని నాని ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. ఇక అంద‌రూ ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని మంత్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement