Friday, May 3, 2024

జవాన్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాన్ కశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంలో యువ జవాన్‌ మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన పబ్బల మల్లయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు అనిల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇండియన్ ఆర్మీలో చేరాడు.

ప్రస్తుతం సీఎఫ్ఎన్ ఏవీఎన్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సౌజన్యతో వివాహమైంది. ఈ దంపతులకు అయాన్, ఆరవ్ అనే ఇద్దరు పిల్లలున్నారు. హెలికాప్టర్ కుప్పకూలడంతో అతడు చనిపోయాడు. ఈ విషయం తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement