Friday, May 17, 2024

‘చూస్తూ ఊరుకోం.. ఖబర్దార్ మోడీ’ అంటూ మంత్రి ఇంద్రకరణ్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప‌ట్ల బీజేపీ వైఖ‌రిని నిర‌సిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం బీజేపీ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కోసం ఎంతో మంది బ‌లిదానాలు చేశారని అన్నారు. పార్ల‌మెంట్ లో ప్ర‌ధాని మోడీ తెలంగాణ అమ‌ర‌వీరులు బ‌లిదానాల‌ను అప‌హాస్యం చేశారని మండిపడ్డారు. భేష‌ర‌తుగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మోడీ క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కుట్ర‌ల‌ను తెలంగాణ స‌మాజం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ‌కు వ్య‌తిరేఖంగా మాట్లాడితే ఊరుకునేది లేదు.. ఖబర్దార్ మోడీ అంటూ హెచ్చరించారు. మ‌త‌త‌త్వ బీజేపీ ప‌ట్ల ప్ర‌జ‌లు అపప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు. తెలంగాణ‌లో మోడీ అండ్ కంప‌నీ ఆట‌లు సాగ‌వన్న ఇంద్రకరణ్ రెడ్డి.. క‌ర్నాట‌క‌లో మ‌త విద్వేషాల‌కు బీజేపీయే కార‌ణం అని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement