ప్రతివారు సింహం, పుల్లులతో ఎదవ కంపారిజాలు అనే డైలాగ్ గుర్తొస్తుంది మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు వింటుంటే. తాను సింహాన్ని అని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారాయన. పార్టీలు వేరు అయినా తన పవర్ మాత్రం ఎపుడూ ఒకేలా ఉంటుందని అది ఎక్కడా తగ్గేది లేదని కూడా బొత్స హాట్ కామెంట్స్ చేశారు. తన హవా తగ్గింది అంటున్న వారు చేతనైతే దాన్ని నిరూపించమన్నారు. తాను కాంగ్రెస్ లో ఉన్నా వైసీపీలో ఉన్నా ఒక్కలాగానే వ్యవహరిస్తానని ఆయన అన్నారు. అయితే జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు మధ్య తేడా ఉంటుందని ఆలోచనలు ఇతర విషయాలలో కూడా వ్యత్యాసాలు చాలా ఉంటాయని ఆయన వివరించారు.
తాను కాంగ్రెస్ లాంటి మహా సముద్రంలో పనిచేశానని అలాగే జగన్ నాయకత్వంలో పని చేస్తున్నానని చెప్పారు. ఇక ఉత్తరాంధ్రాలో బొత్స ఒకనాడు కింగ్ ఇపుడు ఏమీ కాదు అంటూ వస్తున్న వార్తల పట్ల ఆయన మండిపడ్డారు. తనకు ఎపుడూ ప్రజాదరణ ఉందని ,అలాగే తాను అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ప్రజలకు చేతనైన సాయం చేస్తానని తన సాయం కోసం ఉత్తరాంధ్రా జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూంటారన్నారు.