Sunday, April 28, 2024

మెట్రోస్టేష‌న్ పై నుండి దూకి రాజు అనే వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

బేగంపేట్ ప్ర‌కాష్ న‌గ‌ర్ మెట్రోస్టేష‌న్ పై నుండి దూకి రాజు అనే వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కాగా ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటు చేసుకుంది. నిన్న రాత్రి సమయంలో మెట్రో స్టేషన్ పై నుండి దూకడంతో రాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున రాజు మృతి చెందాడు. కుటుంబ కలహాల కారణంగానే రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు పోలీసులు. ఈ దారుణమైన సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు బేగంపేట్ పోలీసులు. నిజామాబాద్ కు చెందిన వ్యక్తిగా రాజును దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు బేగంపేట పోలీసులు. ఇక సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement