Monday, May 6, 2024

Medicos Hub – తెలంగాణలోమ‌రో 8 మెడిక‌ల్ క‌ళాశాల‌లు …. 10 వేలకు పెరిగి మెడికల్ సీట్లు …

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రికి మెరుగైన వైద్యం అందించాల‌నే ఉద్దేశంతో.. ప్ర‌తి జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే దాదాపు అన్ని జిల్లాల్లో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలు అందుబాటులోకి వ‌చ్చాయి. తాజాగా మ‌రో 8 కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, జోగులాంబ గ‌ద్వాల‌, నారాయ‌ణ‌పేట్, మెద‌క్, ములుగు, వ‌రంగ‌ల్ జిల్లాల్లో కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

కాగా, ఈ 9 ఏండ్ల కాలంలో 29 కొత్త ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేసింది. ఈ మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10 వేల‌కు చేరువ కానున్నాయి. మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ‌య్యాయి. స్థానికంగా ఉంటూనే ఎంబీబీఎస్ చదివేందుకు అవకాశాలు పెరిగాయి. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది అని మంత్రి వాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement