Sunday, May 19, 2024

Breaking: రూ.1400కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ …

పట్టుబడిన డ్రగ్స్ విలువ తెలిస్తే… షాకవ్వాల్సిందే.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 700 కేజీల నిషేధిత మెఫోడ్రొన్ ముంబైలో పట్టుబడింది. యాంటీ-నార్కోటిక్ సెల్ అధికారులు ఈరోజు సీజ్ చేశారు. మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.1400 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసొపారాలో ఉన్న ఒక ఔషధ తయారీ కంపెనీ యూనిట్‌లో సోదాలు చేస్తుండగా ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయని తెలిపారు. సమాచారం ఆధారంగా ఏఎన్‌సీ అధికారులు కంపెనీ ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టారు. భారీ మొత్తంలో నిషేధిత మెఫెడ్రొన్ లభ్యమైందన్నారు. కంపెనీ యూనిట్‌లో దీనిని తయారు చేస్తున్నట్టు గుర్తించినట్లు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement