Friday, April 26, 2024

పెరగనున్న మారుతి సుజుకి, నిస్సాన్ ఇండియా కార్ల ధరలు

మీరు కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈనెలలోనే కారు కొనుక్కోండి. ఎందుకంటే ఏప్రిల్ నుంచి పలు కార్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే దేశీయ సంస్థ మారుతి సుజుకి కార్ల ధరలను పెంచగా.. తాజాగా నిస్సాన్ ఇండియా కూడా కార్ల ధరలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి అన్ని రకాల వాహనాలపై ధరలను పెంచుతున్నట్లు నిస్సాన్ ఇండియా ప్రకటించింది.

ఆటోమొబైల్‌ పరికరాల ధరలు నిత్యం పెరుగుతున్నాయని.. కొన్ని నెలల నుంచి ఆ భారాన్ని తామే భరించామని కంపెనీ ఎంపీ రాకేష్ శ్రీవాస్తవ వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో భారం తగ్గించుకునేందుకు వాహనాల ధరలు పెంచుతున్నామని తెలిపారు. దీంతో నిస్సాన్‌, డాట్సన్‌ వాహనాల ధరలు పెరుగుతాయన్నారు. కాగా మోడల్‌, వేరియంట్‌ను బట్టి ఈ పెంపు వర్తిస్తుంది. అయితే ఏ మోడల్‌పై ఎంత ధర పెరిగిందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. మాగ్నైట్‌, కిక్స్‌ వంటి మోడళ్లను నిస్సాన్‌ విక్రయిస్తుంది. ఇక డాట్సన్‌ బ్రాండ్‌ రెడీగో, గో అనే వాహనాలను విక్రయిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement