Friday, March 15, 2024

స్వల్ప లాభాల్లో మార్కెట్లు.. 52 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు.. ఆ తరువాత స్వల్ప లాభనష్టాల్లోనే ఊగిసలాడాయి. చివరికి సెన్సెక్స్‌ 85 పాయింట్ల లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 61,219.64 వద్ద ప్రారంభమై.. 61,385.48 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 61,107.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,235.65 పాయింట్ల వద్ద ప్రారంభమై.. 18,321.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,228.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి సెన్సెక్స్‌ 85.88 (0.14 శాతం) పాయింట్లు ఎగిసి 61,308.91 పాయింట్ల వద్ద, నిఫ్టీ 52.35 (0.29 శాతం) పాయింట్లు లాభపడి 18,308.10 పాయింట్ల వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 స్టాక్స్‌లో 19 స్టాక్స్‌ లాభపడగా.. 11 స్టాక్స్‌ నష్టపోయాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ రెండు శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. ఇక ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్‌ స్టాక్‌ అత్యధికంగా 5.76 శాతం నష్టపోయింది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకు వంటివి నష్టపోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా వంటి స్టాక్స్‌ కూడా నష్టాలు చవిచూశాయి. డాలర్‌ మారకంతో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 74.2 వద్ద ముగిసింది.

హీరో మోటో కార్ప్‌కు భారీ లాభం
టాప్‌ గెయినర్స్‌ జాబితాలో హీరో మోటో కార్ప్‌, గ్రాసీమ్‌, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌ ఉన్నాయి. నేటి టాప్‌ లూజర్స్‌ జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బ్రిటానియా, యాక్సిస్‌ బ్యాంకు, సిప్లా ఉన్నాయి. ఈ నెలలో సూచీలు ఇప్పటికే ఐదు శాతం లాభపడ్డాయి. ఈ వారం దాదాపు స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రీ బడ్జెట్‌ ర్యాలీ సూచీల సానుకూలతకు దోహదం చేశాయి. మార్కెట్‌లో నిఫ్టీ రోజంతా సుమారు 90 పాయింట్ల మధ్యే కదలాడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement