Thursday, May 2, 2024

మావోల ఘాతుకం.. 13కు పెరిగిన మృతుల సంఖ్య

మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 11 మంది పోలీసులు మృతిచెందగా, మరికొందరు గాయపడిన ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా అరన్ పూర్ సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మావోయిస్టులు ఐఈడీ మందు పాతరను అమర్చి.. పేల్చడంతో 11మంది పోలీసులు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరు పోలీసులు గాయపడ్డారు. అయితే గాయపడ్డ పోలీసులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. మరో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. దంతెవాడ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement