Friday, April 26, 2024

Reservation | కర్నాటకలో ముస్లిం కోటా రద్దు.. బీజేపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంలో పిటిషన్​

ముస్లిం కోటా రిజర్వేషన్​ని రద్దు చేస్తూ కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆ రాష్ట్ర ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్​ని దాఖలు చేసింది. అందులో ముస్లింలకు కేవలం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, అంబేద్కర్​ రచించిన రాజ్యంగంలో ఈ అంశాలేవీ లేవని తెలిపింది. అయితే.. కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్​షా సమర్థించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కేవలం మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, సామాజిక న్యాయం, లౌకికవాద సూత్రాలకు ఇది విరుద్ధమని కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓబీసీ కేటగిరీ నుంచి ముస్లింలను తొలగిస్తూ కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ అంజుమన్-ఈ-ఇస్లాం, గులాం రసూల్ అనే ముస్లిం సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఈ పిటిషన్‌కు ప్రతిస్పందనగాకర్నాటక రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాల నాటి ముస్లింలకు కేటాయించిన 4 శాతం కోటాను వొక్కలిగ, లింగాయత్ వర్గాల మధ్య సమానంగా పంచాలని విజ్ఞప్తి చేస్తూ అఫిడవిట్‌ను సమర్పించింది.

వెనుకబడిన తరగతులను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొన్ని కులాల సమాహారంగా పేర్కొన్నారు. సమాజంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు చారిత్రకంగా నిరాశ్రయులైన.. వివక్షకు గురికావడం అనేది కీలక పాయింట్. అదే మొత్తం మతంతో సమానం కాదుఅని ప్రభుత్వం తన అఫిడవిట్​లో పేర్కొంది. స్పృహతో కూడిన పాలనా కార్యక్రమాల ద్వారా సామాజిక, ఆర్థిక వెనుకబాటును పరిష్కరించడానికి తాము నిశ్చయాత్మక చర్య తీసుకున్నామని.. 2002 రిజర్వేషన్ ఆర్డర్‌లోని గ్రూప్ Iలో వెనుకబడిన.. పేర్కొన్న ముస్లిం వర్గాలను ఎంపిక చేసుకోవడం కొనసాగించడానికి అనుమతించామని కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

- Advertisement -

ఇక.. 1979లో ముస్లిం సమాజాన్ని ఇతర వెనుకబడిన తరగతుల కేటగిరీలోకి మొదట చేర్చడం శ్రీ ఎల్‌జీ హవనూర్ నేతృత్వంలోని మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ సిఫార్సులకు విరుద్ధంగా ఉందని, ఆ తర్వాత ప్రధానంగా ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా చెప్పబడిన చేరిక కొనసాగించబడిందని ఆ అఫిడవిట్​లో కర్నాటక ప్రభుత్వం పేర్కొంది. ఆ దశలో రాజ్యాంగ పథకం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల గురించి ఆలోచించలేదని పేర్కొనడం సముచితం అని అఫిడవిట్ తెలిపింది.

ఒక రాష్ట్రంలో రిజర్వేషన్ల మంజూరు, దాని పునర్విభజన అనేది పూర్తిగా వాస్తవ పరిస్థితులపై ఆధారపడిన కార్యనిర్వాహక విధి. ఏ వర్గాన్ని వెనుకబడిన తరగతిగా పరిగణించాలి.. వారికి ఎలాంటి ప్రయోజనాలు అందుబాటులో ఉండాలనేది ప్రతి రాష్ట్రం యొక్క రాజ్యాంగ కర్తవ్యం అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ముస్లింలను వెనుకబడిన కులాలుగా చేర్చాలని కమీషన్లు సిఫారసు చేసినప్పటికీ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్​లో కర్నాటక రాష్ట్రం వాదించింది. ముస్లిం సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను సవాలు చేస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 అర్థంలో చట్టానికి సమానమైన కార్యనిర్వాహక సూచనల ద్వారా 15, 16 అధికరణల నుండి రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని అమలు చేయవచ్చని రాష్ట్రం పేర్కొంది.

కర్నాటక బీజేపీ నిర్ణయాన్ని సమర్థించిన కేంద్ర మంత్రి అమిత్​షా..

ముస్లింలకు 4 శాతం కోటాను రద్దు చేస్తూ కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం సమర్థించారు.పార్టీ మత ఆధారిత రిజర్వేషన్‌లను పార్టీ ఎప్పుడూ నమ్మదని అన్నారు. ముస్లింలకు మత ఆధారిత రిజర్వేషన్లు 4 శాతం ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల జోలికి పోకుండా బీజేపీ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్‌ను రద్దు చేసిందిఅని జిల్లాలోని తేర్డాల్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్​షా అన్నారు. మత ఆధారిత రిజర్వేషన్లు జరగకూడదని తాము నమ్ముతున్నాము అని షా అభిప్రాయపడ్డారు. ముస్లిం రిజర్వేషన్‌ను రద్దు చేసిన తర్వాత బీజేపీ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వొక్కలిగలు, లింగాయత్‌లకు రిజర్వేషన్లను పెంచిందని ఈ సందర్బంగా షా  తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement