Thursday, April 25, 2024

క‌రోనా వేళ హృదయ విదారక సంఘ‌ట‌.. కళ్లముందే అక్సిజన్ అందక..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా రక్కసి వేలాది మంది ప్రాణాలు బలి తీసుకుంటుంది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం, జగన్నాధపురం పంచాయితీ కొయ్యన్నపేటలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు కళ్లముందే శ్వాస అందక కుప్పకూలి ఆక్సిజన్ అందక అసిరి నాయుడు అనే వ్యక్తి మరణించాడు. జి.సిగడాం మండలం కొయ్యాన పేట గ్రామానికి చెందిన పంచిరెడ్డి అసిరి నాయుడు కుటుంబం మొత్తానికి పాజిటివ్ వచ్చింది. భార్య ధనలక్మితోపాటు కూతురు, కొడుకులతో కరోనా బారిన పడ్డారు. అసిరి నాయుడు ఆక్సిజన్ అందక పోవడం వలన మరణించాడు. కరోనా రక్కసికి అసిరి నాయుడు భార్య, కూతురు కళ్లముందే ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచిన ఘటన కంటతడి పెట్టిస్తుంది.

గతంలో ఏదైనా రోగంతో కుటుంబ సభ్యులు కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారు కానీ చనిపోతే వందల సంఖ్యలో జనం వచ్చేవారు. హితులు, స్నేహితులు, సన్నిహితులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించే వారు. కానీ. ఇప్పుడు కరోనా మృతులను సందర్శించేందుకు కూడా ఎవరూ రావడం లేదు. చాలా సందర్భారల్లో కుటుంబ సభ్యులు సైతం మృతుల చివరి చూపుకు సైతం నోచుకోవడం లేదు.


Advertisement

తాజా వార్తలు

Advertisement